పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11


క.

నీకున్ బ్రబంధరత్నము
నాకల్పోన్నతిగ నిచ్చి యపవర్గపద
శ్రీ కర్హుఁడ నై వెలసెదఁ
జేకొను మౌభలగిరీంద్ర శ్రీనరసింహా.

50


వ.

నిత్యపరంపరామంగళాభివృద్ధిగా నారచింపం బూనిన వాసిష్ఠరామా
యణంబునకుం గథాప్రారంభం బెట్టి దనిన.

51


వ.

వైరాగ్యంబు, ముముక్షుత, ఉత్పత్తి, స్థిత, ఉపశమనంబు, నిర్వా
ణంబు, అని జ్ఞానోపదేశంబు లాఱుప్రకరణంబు లై యొప్పు అందు
బాలలీలోత్సుకుండగు రామచంద్రుండు ప్రసంగరూపంబున నువన్య
సించిన వైరాగ్యప్రకరణంబు తొలుత నెఱింగించెద.

52


క.

అతులతపస్స్వాధ్యాయ
వ్రతశీలుడు బోధనిధి భరద్వాజుఁడు వి
శ్రుతకీర్తిన్ యొక్కనాఁ డే
కతమున వాల్మీకిమౌనిఁ గని సుప్రీతిన్.

53


క.

పాదప్రణామపూజల
సాదరమున గురునిఁ దనిపి సాంజలియై య
వ్వేదమయుమొగము గనుఁగొని
మోలి మృదుమధురవాక్యముల నిట్లనియెన్.

54


గీ.

అనఘమానస మీదయ నఖిలవేద
శాస్త్రపారంగతుఁడ నైతి; జనులజన్మ
కలిత సంసార దురితసంకటము దొఱఁగి
యవ్యయానంద మగుమార్గ మానతిమ్ము.

55


వ.

అనిన విని ప్రియశిష్యుం డగుభరద్వాజునకు వాల్మీకి యిట్లనియె.

56


క.

విను వత్స లెస్స యడిగితి,
విన యోగ్యుఁడ వీవు నీకు విస్పష్టముగా