పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో డా॥ గూటాలకు సత్కారం.

సంబంధాలు పెట్టుకొని ఇంగ్లాండ్‌లో నివశిస్తున్న తెలుగువారి సంతానానికి తెలుగుభాషా సంస్కృతులను పరిచయం చేసి, వారికి తమ సాంస్కృతిక వారసత్వం పట్ల అవగాహన, ఆసక్తి కలిగించడానికి విశేషంగా కృషి చేశారు. కృష్ణమూర్తిగారి అభిప్రాయం ప్రకారం 1890-1900 దశాబ్దం ఆంగ్ల సాహిత్యానికి స్వర్ణయుగం. ఆ దశాబ్దం ప్రాముఖ్యతను తెలియజెప్పడానికి "1890's Society" అనే సాహిత్య సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నారు. దాని పక్షాన పది జీవిత చరిత్రలు ప్రచురించారు.

"ఏ దేశమేగినా ఎందుకాలిడినా

పొగడరా నీ తల్లి భూమి భారతిని"

అన్న గురజాడ సందేశాన్ని ఆచరణాత్మకం చేసిన మహనీయ వ్యక్తి డా. గూటాల కృష్ణమూర్తి ఆంగ్ల సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరింపజేసుకున్న తెలుగుతల్లి ముద్దుబిడ్డడు డా॥ గూటాల కృష్ణమూర్తి.

84