పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్లసాహిత్యానికి

విశేష సేవలందించిన తెలుగుతేజం

డా. గూటాల కృష్ణమూర్తి


తెలుగు భాషోద్ధరణకు ఎనలేని సేవ లందించిన ఆంగ్లేయుడు సి.పి. బ్రౌన్ గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. ఆంగ్ల సాహిత్యానికి విశేష సేవలందించిన తెలుగు తేజం డా. గూటాల కృష్ణంమూర్తి. 1890 సంవత్సరం నుంచి 1900 - సంవత్సరం వరకు ఆంగ్ల సాహిత్యానికి స్వర్ణయుగమని నిరూపించిన మహోన్నత సాహిత్యమూర్తి డా॥ గూటాల కృష్ణమూర్తి, వారి ఆంగ్ల సాహిత్యసేవను చూస్తే, బ్రౌను తెలుగు సాహిత్యానికి చేసిన సేవతో సరితూచవచ్చు. బ్రౌనుకు తెలుగు జాతి పడిన రుణాన్ని కృష్ణమూర్తిగారు ఈ రీతిగ తీర్చాడనిపిస్తున్నది.

మా లండన్ పర్యటనలో డా. గూటాల కృష్ణమూర్తిని కలవడం ప్రధానమైన అంశం. 1975లో విదేశాంధ్ర ప్రచురణలు అనే సంస్థను లండన్లో ప్రారంబించి, పురిపండ అప్పలస్వామిగారి "పులిపంజా" కవితాసంపుటిని సర్వాంగసుందరంగా విదేశాల్లో ప్రచురించి, హైదరాబాదు 'కళాభవన్లో ఆనాటి విద్యాసాంస్కృతిక శాఖామాత్యులైన మా నాన్నగారు మండలి వెంకట కృష్ణారావుగారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం, ఆ సందర్భంగా గూటాలవారిని నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది.

పచ్చని మేని ఛాయతో సూటు, బూటులో తెల్లదొరలా కనిపించేవారు.

78