పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పారుదల అభివృద్ధికి చేసిన అవిరళకృషిని స్మరించుకోవడం మాకెప్పటికీ ఆనందదాయకంగానే ఉంటుంది.

వారిచ్చిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "జలయజ్ఞం" పేరుతో నీటి పారుదల అభివృద్ధికి ఒక ప్రతిష్టాత్మకమైన బృహత్ ప్రణాళికను చేపట్టింది. ప్రణాళిక మూలంగా కోటి పదిహేను లక్షల ఎకరాల భూమి అదనంగా సాగుకు వస్తుంది. ఇందులో భాగంగా భారీ, మధ్యతరహా నిర్మాణం క్రొత్తగా చేపట్టడమే కాక, ఇప్పటికే ఉన్న నీటి వనరులను ఆధునీకరించడం జరుగుతున్నది. దీని మూలంగా వ్యవసాయోత్పత్తులు అపారంగా పెరిగి, రైతుల పరిస్థితి మెరుగు పడటమే కాక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సర్వతోముఖంగా అభివృద్ది చెందగలదని ఆశిస్తున్నాము.

సర్ ఆర్థర్ కాటన్ నీటిపారుదల విషయంలో ఈ రాష్ట్రానికి చేసిన గణనీయమైన కృషికి గుర్తుగా వారి పేర 2009 నవంబర్ / డిసెంబర్ మాసంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. సర్ ఆర్థర్ కాటన్ వంశానికి చెందిన మిమ్మల్ని వారి వారసులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ఆహ్వానిస్తున్నాను.

దీనిని నా వ్యక్తిగత ఆహ్వానంగా కూడా భావించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాదు నగరానికి విచ్చేసి, రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఈ చారిత్రాత్మక సన్నివేశంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తోడ్పడవలసిందిగా అభ్యరిస్తున్నాను.

గౌరవాభినందనలతో,
మీ
వై.యస్. రాజశేఖరరెడ్డి

75