పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కాలంలో బాగా వివరంగా చెక్కబడినట్టిది. బోధి వృక్షం క్రింద ఖాళీ సింహాసనం బుద్ధుని జ్ఞానోదయాన్ని సూచిస్తుంది.

సున్నపురాతి స్థంభ భాగం

దీని నాలుగు వైపులా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇది బౌద్ధమత ప్రారంభ కాలానికి చెందినదిగా గుర్తించబడింది. ఇందులో మూడు ప్రక్కల పద్మాలు చెక్కబడి ఉన్నాయి. నాలుగవ వైపు మరింత సున్నితమైన పనితనంతో ఉండి, పూర్ణ ఘటమూ, యక్షిణి ముఖం కనిపిస్తున్నాయి.

అమరావతి శిల్ప వైభవాన్ని మించింది మరేదీ లేదు. మన ఆంధ్ర శిల్పి కళానైపుణ్యం జగజ్జీగీయమానంగా అమరావతి శిల్పాలలో దర్శనమిస్తుంది. ఆంధ్ర శిల్పికి జేజేలు.