పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధుని జీవితంలో ఒక దృశ్యాన్నిసూచించే సున్నపురాతి స్థంభం

క్రీ.శ. మూడవ శతాబ్దికి చెందిన ఈ కళాఖండం అమరావతి బృహత్ స్తూపం చుట్టూ ఉన్న ప్రాకారం నుంచి సేకరించబడింది.

బుద్ధుని సోదరుడైన సుందరానందుడు (నందుడు) బౌద్ధమతాన్ని స్వీకరిస్తున్న దృశ్యం ఈ శిల్పంలో అద్భుతంగా మలచబడింది.

రెండవ దృశ్యంలో బుద్ధుడు సుందరానందునికి సన్యాసం ఇస్తాడు. ఈ సందర్భంలో అతడు బుద్దుని ముందు మోకరిల్లి, ఆయన అనుగ్రహం కోసం తలయెత్తి పైకి చూస్తుండగా, బుద్ధుడు సుందరానందునిపై కారుణ్య దృక్కులను వర్తిస్తుంటాడు.

బుద్ధుని అవశేషాల అర్చన

అమరావతి మహాస్తూపం వేదిక నుంచి ఇది గ్రహించబడింది. ఇటువంటి దృశ్యాలను సాధారణంగా స్తూప పార్శ్వాలలో అమరుస్తారు.

ఈ శిల్పంలో బుద్ధుని అవశేషాలను ఒక ఆసనం మీద ఉంచి, అక్కడ బుద్ధుడు సజీవంగా ఆసీనుడైనట్లుగా భావించి, పూజించడం గమనించవచ్చు. నిజానికి బుద్ధుడు ఈ అవశేషాల ఆరాధనకు వ్యతిరేకం.

రాకుమారుడు సిద్ధార్థుని జన్మవృత్తాంతం చిత్రీకరించబడివున్న సున్నపురాతి పలక

క్రీ.శ. 2వ శతాబ్దికి చెందిన ఈ సున్నపురాతి పలక అమరావతి బృహత్ స్తూపం నుంచి సేకరించబడింది. అప్పడప్పడే భారతదేశంలో వ్యాప్తిలోకి వస్తున్న బౌద్ధమతానికి ప్రతీకగా ఈ అద్భుత శిల్పాన్ని భావించవచ్చు అమరావతికి చెందిన అత్యంత సుందర శిల్పాలలో ఒకటైన ఈ పలకలో సిద్ధార్ధుని జన్మ వృత్తాంతానికి సంబంధించిన నాలుగు ఇతివృత్తాలను గమనించవచ్చు.