పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రకేసరి

బిరుదాంకితులు, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘాధ్యక్షులునగు మ.రా. టంగుటూరి ప్రకాశం పంతులగారి

సందేశము.

ఆంధ్ర కేసరి గ్రంధమాల ప్రధమ కుసుమమైన "కమ్మతెమ్మరలు" కృతజ్ఞతతో అందుకున్నాను. హైద్రాబాదు సంస్థానములోని ఆంధ్రయువకులు, భాషాభివృద్ధికి, ఆంధ్రవిజ్ఞానాభివృద్ధికి ఈ గ్రంధమాల ద్వారా జనసామాన్యమునకు సేవచేయ సంకల్పించు కోవడం చాలా సంతోషకరమైన విషయం. వారి ప్రయత్నం పూర్తిగా నెరవేరి హైద్రాబాదు ఆంధ్రులలో తెలుగుభాషయందు ఆసక్తి వృద్ధిపొందునుగాక యని నమ్ముచున్నాను.


టం. ప్రకాశం.

పూనా.

27 - 7 - 40