Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షితిఁ బొడమినజంతువులకు
మృతికంటె భయంబు లేదు మిథ్యావచనా.

30


సీ.

పటుతరస్తంభసంభార మైనగృహంబు
        కాలంబు చన జీర్ణకలనఁ జెంది
నశియించుకరణి నా నానాప్రాణినికరంబు
        వాలాయముగ మృత్యువశత నడఁగు
దినములు రాత్రులు చనచన సర్వమా
        నవుల కాయుష్యంబు నాశ మొందు
నాత్మకు శోకింప నగు నన్యమున కేల
        శోకించెదవు తెల్వి లేక నీవు


గీ.

నెరయఁ బరువెత్తుచున్నవానికిని నిలిచి
యున్నవానికి నైన నాయువు నశించుఁ
దాని సమవర్తియును జనుదాన నిలచు
దూర మరిగియు మృత్యువుతోన మరలు.

31


క.

వళు లుద్భవించు మేనం
దలవెండ్రుక లెల్ల నెరియు దంతము లూడున్
బల ముడుగు శ్వాసకాసము
లలముకొను న్మదిని దేహ మలజడి నొందున్.

32


గీ.

వరదకట్టియ యొకచోట వనధియందుఁ
గలసి యంతట విడిపోవుకరణి దార
పుత్రబాంధవధనపశుక్షేత్రవర్గ
మొక్కచో గూడు నెడఁబాయు నొక్కవేళ.

33


సీ.

చనుచున్న తెరువరిఁ గని త్రోవ నొకతెరు
        వరి నేను నీతోడ వచ్చెదనని
యంత వారిద్దఱుఁ గొంతకాలము గూడి
        చని వెండియును భిన్నసరణి జనిన