Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

పొసగ రామేశునభిషేకమునకు భక్తి
బొదలఁ బా లిచ్చుపెనుసాధుమొదవు నిడిన
భాగ్యశాలికి హయమేధఫలము దొరకు
నభవుసారూప్య మమరదే హాత్యయమున.

62


క.

సేతువున ధనుష్కోటి
ప్రీతిని రామేశు నీశుఁ బేర్కొని పురుషుం
డేతోయమున మునింగిన
సేతునిమజ్జనఫలంబు శివకృపఁ గలుఁగున్.

63


వ.

మఱియు రామనాథలింగంబు సుధాలిప్తంబు గావించినవానిపు
ణ్యఫలంబు వక్కాణింప శతసంవత్సరంబులకైన సమర్ధుడఁ గాను.
రామేశుమందిరంబు శిథిలం బగునేని వెండియు నూతనంబుగా నమర్చి
నపురుషునకుఁ బూర్వకర్తకన్న శతగుణం బగుమహాపుణ్యంబుఁ జెం
దు పదివేలబ్రహ్మహత్యలు నశించు నాస్వామియగ్రభాగంబున
దీపంబు లిడినజను లవిద్యాపటలంబు భేదించి పరబ్రహ్మసాయు
జ్యంబుఁ జెందుదురు. ఘృతతైలముద్గతండులగుడశర్కరాదిపదా
ర్థంబులు సమర్పించువారు దేవేంద్రస్థానంబున వసింతురు. రామే
శ్వరమహాదేవలింగంబు దర్శించినఁ బూజించిన స్మరించిన స్పృ
శించిన నెల్లవారికి సకలపాపంబులును దొలంగు.

64


గీ.

కంచుగంటయు నద్దంబు కాన్క గాఁగ
నెలమిలో రామనాథున కిడినప్రోడ
భాసురవిమానశతభోగపరత నొంది
శ్రీమహాదేవుపురిని వసించుఁ దడవు.

65


సీ.

డమరుకడిండిమఢక్కకాదుందుభి
        పణవగోముఖశంకపటహలటహ
వంశకాంస్యాదికవాదిత్రములు నవ్య
        వాద్యవిశేషము ల్వలను మీఱ