Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

రామనాథునిమందిరము దారువులఁ జేయు
        మనుజుండు సురలోకమునఁ ద్రికోటి
కులయుతుఁ డై నిల్చు కుదురుగా నిటుకఁ గ
        ట్టినవాఁడు వైకుంఠమున వసించు
శిలలచేఁ గట్టించు నలఘుపుణ్యుఁడు బ్రహ్మ
        పట్టణంబున నెప్డు బాయకుండు
స్ఫటికాదిబహువిధోపలముల రామేశు
        భవనంబు నిర్మించుపావనుండు


గీ.

భానుమండలతులితవిమాన మెక్కి
సురవధూకరచారుచామరమనోజ
మారుతాంకూరసంవీజ్యమానుఁ డగుచు
హరునిలోకంబునకుఁ జను సురలు వొగడ.

40


గీ.

ధీరుఁ డెవ్వఁడు రామేశుదేవళంబు
వెండిపలకల రచియించు వేడ్క మీఱఁ
భవ్యశంకరసారూప్యపదవిఁ గాంచు
నతఁడు శివుమాడ్కి నానంద మనుభవించుఁ.

41


గీ.

మట్టు మీఱంగ రామేశుమందిరంబుఁ
గలిమి గలవాఁడు గట్టించుఁ గాంచనమున
పూని మట్టినిఁ గట్టించు లేనివాఁడు
తెలియ నిరువాగునకుఁ బుణ్యఫలము సమము.

42


గీ.

శక్తికొలఁదిని వివిధోపచారములును
పూని రామేశ్వరునిఁ గొల్వఁ డేనరుండు
భుక్తికిని ముక్తికిని రాజ్యమునకు నతఁడు
భాజనము గాఁడు పరమనిర్భాగ్యుఁ డతఁడు.

43


వ.

మఱియు భక్తితాత్పర్యంబుల రామనాథీశ్వరుం బూజించువాఁడు
భుక్తిముక్తిరాజ్యభాజనం బగు రామనాథార్చనసమంబునుం దద
ధికంబును నగుపుణ్యంబు లేదు. రామనాథేశ్వరలింగద్వేషి యగు