Jump to content

పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జనని యెవ్వతె యిఁక బాల్యచాపలమునఁ
బోరు పెట్టెడిననుఁ జేరి బుజ్జగించు.

92


గీ.

జీర్ణపర్ణంబు పారణశిథిలతనుల
నిరపరాధుల దృఢతపోనిష్ఠ గలుగు
వారి మిముల నిపుడు నిష్కారణంబ
చంపె నెవ్వఁడు దారుణసాయకముల.

93


వ.

అని పెక్కుభంగుల నమ్మునికుమారుండు పెద్దయెలంగెత్తి రోద
నంబు సేయుచుండె నంతం దత్ప్రలపితం బాలకించి శంకరభూపా
లుండు శబ్దంబున కభిముఖుం డై చని గుహాద్వారంబుఁ జేర నచ్చటి
మునులందఱు కయ్యాక్రందనంబు విని తదాశ్రమంబునకు సత్వరం
బుగా వచ్చి శరనిహతు లైన మునిదంపతులం గాంచి ధనుర్ధరుం డగు
రాజును విలోకించి విలపించుచున్న మునిపుత్త్రునిం గని భృశవి
హ్వలు లై భీతిచేతస్కుం డైనమునిపుత్రు నాశ్వాసింపుచు ని ట్లనిరి.

94


క.

ధనియెడ నిస్వునియెడ న
జ్ఞునియెడఁ బండితునియెడఁ గృశునియెడలం దీ
మునియెడల నైన నంతకుఁ
డనఘా సమవర్తి సంశయము లేదు సుమీ.

95


క.

వనమున నభమున గ్రామం
బున నగమున నెట్టిదేశమున నెచ్చట నుం
డినఁ గాని యమునివశతం
జనవలయు న్సకలజంతుసంతతి కనఘా.

96


గీ.

బాలకులు వృద్ధు లగువారు బహ్మచారు
లరయ గృహమేధులుని విపినాలయులును
యతులును శరీరములు విడనాడి యముని
వీఁడు జొత్తురు కాలంబు గూడె నేని.

97


క.

విప్రులు క్షత్రియులును వై
శ్యప్రవరులు శూద్రు లితరిసంకరజాతుల్