102
రామాయణ విశేషములు
తుష్టిపూర్తిగా మాంసము తినిపించుచుండిరి. అగస్త్యమహర్షియు ఒకమారు వారి శ్రాద్ధ భోజనములో మేకమాంసమును భుజించెను. ఆర. 11-66 దీనినిబట్టి మునులుకూడా ఎప్పుడు తప్పినను శ్రాద్ధములందైనను మాంసమును తినుచుండిరని ఊహింపవచ్చును.
గంగానది దాటునప్పుడు సీతాదేవి యిట్లని మ్రొక్కుకొనెను: “గంగాదేవీ, మేము సుఖముగా తిరిగి వచ్చినట్లైన నీకు 10,000 ఆవులను, 1000 సురాభాండములను మాంసాన్నమును సమర్పించు కొంటాను.” (అయో. 52-89). అదే విధముగా యమునానదిని దాటు నప్పుడును ఇట్లు మ్రొక్కుకొనెను: “మేము సుఖముగా తిరిగి వచ్చి నట్లైన నీకు 1000 ఆవులు 100 కల్లుకుండలు సమర్పించుకొందును" (అయో. 55-20).
రాముడు గంగదాటి అరణ్యమును ప్రవేశించిన మొదటిదినమే నాలుగు జంతువులను ఆహారార్థమై వేటాడెను.
తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్
వరాహ మృశ్యం పృషతం మహారురుం
ఆదాయ మేథ్యం త్వరితం బుభుక్షితౌ
(అయో. 52-102)
సీతారామలక్ష్మణులు బాగా ఆకలికొనియుండిరి. అప్పుడు
రాముడు పందిని, మనుబోతును, దుప్పిని, నల్లచారల దుప్పిని చంపెను.
వాటి పరిశుద్ధమగు మాంసమును వారు భుజించిరి. యమునాతీరమందలి
వనమును చేరినప్పుడు రామ లక్ష్మణులు -
బహూన్ మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతు ర్యమునావనే.
(అయో. 55-98)