Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణ విశేషములు

67

ఉన్న యొక్క కూతురును ఎవడో అంగరాజట, అతనికి దత్తుగా ఇచ్చి వేసెను. ఈ కథయంతయు కల్పితమే యని స్పష్టము

7

రాముడు వనవాసమునకు వెళ్ళుచు కైకతో ఇట్లు శపథము చేసెను:


చతుర్దశహి వర్షాణి వత్స్యామి విజనే వనే, మధుమూల ఫలైర్జీవన్
హిత్వా మునివ దామిషం.
                                                           - అయోధ్య. 20-29


నేను ఈ 14 ఏండ్లు మాంసము తినకుండ మునివలె అరణ్యంలో ఉంటాను అని మాటయిచ్చి నాలుగైదు దినాలకే అరణ్యానికి పోయిన ఆది లోనే ఆ శపథాన్ని మరచిపోయెనా? గంగనుదాటి మొదటిదినమే అరణ్యావాసము చేసిననాడు నాలుగు పెద్దమృగాలను చంపి తానును సీతయు లక్ష్మణుడును తినినారు.


“తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్, వరాహ మృశ్యం పృషతం మహారురుం
 అదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ, వాసాయ కాలే యయతు ర్వనస్పతిమ్. - అయోధ్య. 50-102.


ఇంతేకాక ఇంచుమించు పది యిరువదితావులందు రామాదులు మాంసమును తిన్నట్లు వర్ణించినారు. హనుమంతుడు సీతతో ఇట్లన్నాడు: “రాముడు మీ వియోగదుఃఖముచే మద్యమాంసములను వదలివేసినాడు.” (సుం.36-41)


దీనినిబట్టి రామాదుల మాంసభక్షణమో లేక తద్వర్జనమో ఏదో యొక భాగము ప్రక్షిప్తమైనదనుట స్పష్టము.