పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46 రాధికాసాంత్వనము

చ. అప్పుడు పయఃపయోధిమణియల్లునిఁ బిల్వఁగ నెమ్మిఁ గోరి స
ద్విపులకుల ప్రదీపకుఁడు విశ్రుతకీర్తి యశోదతోడఁబు
ట్టపరిమితప్రభావజనకాధిపుమన్ననఁ గొన్నకుంభకుం
డుపగతహర్షుఁ డై వరుస లొప్పఁగ వచ్చెను నందుచెంతకున్. 16

క. వచ్చిన మఱఁదిని గని ముద
మెచ్చఁగ వడి లేచి కౌఁగి లిచ్చి సమానం
బచ్చుపడఁ బసిఁడిగద్దియ
నిచ్చి రహి న్నందుఁ డతని నీక్షించి దయన్. 17

ఉ. వచ్చిన కార్య మే మనుచుఁ • బల్కిన నాతఁడు కూఁతు నల్లునిన్
మచ్చికఁ బంపఁగా వలయు మా సదనంబున కన్న, రాధతో
జెచ్చెర నెచ్చరించి యటు చేయుదు నం చని నందుఁ డాడఁగా,
నచ్చెలియింటికిం జనె నిశాబ్జదళాక్షినిఁ గన్నతండ్రియున్. 18

వ. ఇట్లు చనునెడ నాళీజనంబులవలనఁ దదాగమనం బాలకించి యవ్విరించిగురుం దుదంచితముదం బెదం గదుర నెదుర్కొని ప్రణమిలి యవ్వల్లవతల్లజునిదీవనలం జెందిన వేడుకఁ దోడుకొని తెచ్చి హెచ్చు పచ్చరాగద్దియ నుంచిన నతం డందు వసించి రాధావధూరత్నంబుతోనం గురియించి యిళామాధవులఁదోడ్కొని మానివాసంబుకునకు నీవు రావలయు నన నావనజానన యయ్యా నన్నడుగం బని యేమి యయ్యిళయు నేనును మీ కొక్కరూప కాదె న న్బిలువ వలయునే వలసినప్పుడు వచ్చెద నిప్పు డివ్వధూవరులఁ బిలుచుకొని చనుం డని పనిచిన వారలం దోడ్కొని నిజమనోరధంబీడేర రథం బారోహించి యాభీరవీరు లపారాయుధపాణులై బలసి నలువంకలంగొలువ నమితానందంబును జెంది నందుమఱంది నిజమందిరంబునకుం జని సుఖంబుండె నంత నిచ్చట. 19

సీ. పద్మాక్షుఁడును దాను బవళించుపడకయి
ల్గని కను ల్కటికచీఁకటులు గ్రమ్మ
నెడలేక మురవైరి నెనయుముచ్చట లెంచి
పగిలి గుండియ వకాలవకలు గాఁగ