పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 25



డెం కగుననురాగరసం
బింకఁగ వెలిఁ దీసి విభున కిప్పించె ననన్. 85

క. గంధామలకము వెట్టెను
గంధేభసమానయాన గనుకనిఁ గరమున్
గంధతను లంది యియ్యఁగ
గంధవతీధవున కపుడు గరిమ దలిర్పన్. 86

తే. పసిఁడిగిండులచే ముంచి పడఁతు లియ్య
జలక మార్చెను జెలువ గొజ్జంగినీట
రమణునకు రాధ మదనసామ్రాజ్యమునకుఁ
జెలగి పట్టాభిషేకంబుఁ జేసె ననఁగ. 87

సీ. కురు లార్చె నొకలేమ సురటి నొక్కతె వీవ
పరిమళాగురులధూపముల నొసఁగి
సిగ వైచె నొకభామ నిగరాలతాయెతు
ల్గీలించి జంటరుమాలు గట్టి
విరు లుంచె నొకరామ విదళించి పన్నీటఁ
బద నిచ్చి గోవజవ్వాజిఁ జమిరి
పట మిచ్చె నొకచాన యటు విప్పి నలుగంగ
నీక తావులు గట్టి నెగయఁ బట్టి
తే. తిలకవతి యోర్తు కస్తూరితిలక మునిచె
గంధగజయాన యొక్కతె గంధ మలఁదెఁ
దడవుగా నోర్తు రత్నాలతొడవు లిడియె
శౌరికిని జాల సయ్యలంకారవేళ. 88

క. ఎనిమిదిదిక్కులరాజుల
ఘనకీర్తులు వచ్చి యతనిఁ గవిసె ననంగా
నునుముత్తెపుఁ జౌకట్టులు
వినుతాంగి యిడంగ శౌరి వీనుల మెఱసెన్. 89