పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రససమీక్ష

మధురసంగీతగీతికాలాపమోహనపారవశ్యము—సరసత్వము…చెలులకే చెల్లుతుంది. ఈ ఔపచారికదోహదవిధులలో…ననవర్ధితమైన కవితావైభవము—పరిమళ మలవడినమేలిమి.

యౌవనోపభోగముల చవులెరిగిన మిటారపువయసుకత్తె కవితామాధుర్యము భోజదేవునే పరవశుణ్ణి చేసింది. విద్వత్కుటుంబమును సన్మానించి గౌరవించడంలో…కళామోహిని అయినపడుచుకోడలి పద్యరచనకే అగ్రమర్యాద జరిగినది.

భోజునిబామరగ్రాహిణిసీత…ఎన్నికకువచ్చిన కవితావిదుషి.

ఆంధ్రభోజుఁడు—తుళువ కృష్ణరాయని కూతురు…మోహనాంగి!

ఆ వదాన్యరాజసముతో తీరికలు దిద్దుకున్న మహారాష్ట్ర—నాయకుల వినోదసదస్సులలో అపరభారతులై, కనకాభిషేకపరువము దక్కించుకున్న—శృంగారనాయికలు…వలపుల దొరసానులు…ప్రబంధరూపబంధనిర్మాణలు…జాణలు.

ఎటుచూచినా మొదటినుంచీ చక్కనికవిత్వరచనచేయడం—కావ్యరసికులను మెప్పించడం—సీమంతినులసొ మ్మని విశదమౌతూన్నది.
మండలముల బారున ఋక్సాముచేసిన ఋషులతోబాటు…సంహితకు రచనామణీదీధితులు అలవరించిన వైదికయోషలకున్నూ—ఏకప్రధనము ఉన్నది. అంతవరకూ ఎందుకు?—‘యఃకౌమారహరః’ అన్న ఒక్కపద్యమే—శీలభట్టారికకీర్తిని కావ్యఅనుక్రమంలో వర్ధిల్లజేస్తూన్నది.

అలంకారికులు అందరూ మధ్యమరసమని శృంగారమునకు ప్రధానఫాయా కల్పించినారు. రతి…అష్టాదశకావ్యవర్ణనలలో—ఉద్రేకస్థాయిని రెట్టించి మంగళపరమావధిని కలిగించె ఉపకరణము.