పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108 రాధికాసాంత్వనము

తే. మలయమారుత మెం దైనమంట లౌనె
బిసరుహాక్షికి సురటిచే విసరుచున్న
మదిమదిని నేనె కొనినట్టికొదవ లనక
సారె కీవేళఁ బరులను దూఱనేల. 129

సీ. కుచకుంభములమీఁద గోరంకుశం బాని
కఱకుకఱుక్కున నఱకి పట్టి
కమ్మపుప్పొడిలోన దుమ్మరం బాడించి
చలువగొజ్జఁగినీటఁ జల్లు కొలిపి
మచ్చికమాటల మెచ్చుచు లాలించి
ననసెజ్జ సజ్జారమునను జేర్చి
మరులుకొల్పెడిసంకుమదతైల మెనయించి
తాంబూల మనుకబళంబు మేపి
తే. చివచివగ నెక్కి మర్మముల్ దవుల నొక్కి
దురుసుపైసరముల నెంతొ దరముఁ జూపి
నెయ్య మలగార మబ్బుదట్టియ్యకున్న
మనసున హుషారు చెంద దా మరునిదంతి. 130

ఉ. ఎవ్వరికూటము ల్చెఱిచి యెవ్వరి ము న్నెడఁబాపినామొ నేఁ
డివ్వగ రవ్వ లంది యిపు డిద్దఱ మిద్దఱ మై విదేశత
న్నొవ్వక నొచ్చి మోహ మనునూత మునింగి సుఖంబు లేక హా
జవ్వన మెల్లఁబో గడపి దా నట నే నిటఁ దల్లడిల్లఁగన్. 131

సీ. హృదయేశ నినుఁ బాసి యేఁ దాళజాలరా
జాములో వత్తువో జాగు లేక
జీవితేశ్వర పోయి నీ విందు రా మఱి
జాములు రెం డౌనొ సైచ లేను
ప్రాణనాయక బదు ల్పలుక వ దేలరా
జాములు మూఁడౌనొ సాగి రాను