పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86 రాధికాసాంత్వనము

దరుణిలేనునుతొడ ల్తలగడదిం డ్లాయె
వెలఁదిగుబ్బలు చెంపబిళ్ళ లాయె
లలితాంగిచెమ్మట ల్చలువపన్నీ రాయెఁ
గలికిమేను నలుంగుకలప మాయె
తే. బోటి పడకిల్లు జిగికొల్వుఁకూట మాయె
లోలలోచనతోడిదే లోక మాయెఁ
బలుకు లేటికి నిపు డిళాభామనుండి
యచట శౌరికి దొరతన మమరె నమ్మ. 40

తే. మగువ యదిగాక యిఁక నొక్కమాటగలదు
వినుము వలపులదొరసాని యనెడు పేరు
దాని కిచ్చెను నినుఁ బిల్వఁబో నటంచు
నెటుల నో రాడెనో శౌరి కెఱుఁగనమ్మ. 41

తే. రాధలోనను నాలోన రమణి యెవతె
తెలుపుమా యంచు నాసతోఁ బలుక నాతఁ
డన్ని టను మీర లొక్కరూ పైనఁగాని
మురిపెమున నీవె హెచ్చనె మోహనాంగి. 42

వ. అనిన విని రాధావధూరత్నం బిట్లనియె. 43

ఉ. ఎల్ల జగంబుల న్మనుచు నేలిక కంజుభవాదిమౌనిహృ
త్ఫుల్లసరోజరాజములఁ బూని వెలింగెడితేజ మిందిరా
హల్లకపాణిబాహువుల కబ్బనిదివ్యసుఖంబు చిత్ర మీ
వల్లవకామినీచరణవారిజసేవకు లెస్సఁ జిక్కెఁగా. 44
.
తే. వారి వీరిని నన నేల వీరి వారి
గలగలపు చేయున న్నన వలయుఁగాక
తెఱఁ గెఱుంగక యపు డట్టు దిమ్మగొంటి
తలఁపఁ దననుండిరానట్టి తప్పు గలదె. 45