పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

95


క.

కంజాతరాగమణిగణ
సంజాతరుచిచ్ఛటావిశంకట మగుచున్
రంజిలు పంజర మానృప
కుంజరుఁ డారామచిలుకకుం దగనిచ్చెన్.

189


గీ.

అట్లు మామయు నల్లుండు నఖిలబంధు
సమితియును నీడు జోడాడి సంభ్రమింప
నంత నరుణోదయంబయ్యె నప్పు డుచిత
కృత్యములు దీర్చి సింధుధాత్రీవిభుండు.

190


సీ.

సకలవస్తువ్రాతసంపూరితములైన
                       కాంచనమయశతాంగములు నూఱు
ఖచితనానారత్నకంకణంబులతోడఁ
                       గొమరారుదంతావళములు వేయి
కరువలికన్న వెగ్గలముగా మున్నాడఁ
                       జాలిన దొడ్డతేజీలు లక్ష
విక్రమార్కునికంటె విక్రమోన్నతిగల
                       పరమార్థులైన సద్భటులు కోటి


గీ.

వేఱువేఱుగ నేర్చి పృథ్వీతలేంద్ర
తిలకమగు నాత్మజామాతఁ గొలిచి వెంటఁ
బోవ నియమించి శుద్దాంతమునకుఁ బోయి
తనదు దేవేరితోడ నిట్లనియె నృపుఁడు.

191


క.

మన ముద్దుపట్టి భాగ్యం
బనితరసులభంబు మోహనాంగుడు విద్యా
ఘనపదవినమ్రనానా
జనపతి వరుఁడయ్యె నిఁక విచారం బేలా.

192


గీ.

తగినబుద్ధులు చెప్పి యీతలిరుఁబోఁడి
ననుఁగుఁగూఁతును నిప్పుడ యనుపు మనిన