పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

రాజశేఖరచరిత్రము


కీనుతకీర్తులంచు నృపకేసరి యల్లున కిచ్చె నొక్కతే
జీ నపరంజివ్రాతపని చిత్తరుపల్లము లుల్లసిల్లగన్.

184


క.

పనుపున కిచ్చెఁ గుమారికి
వసుధాతలభర్త శాలివరవర్ణితముల్
కుసుమశరచాపరుచి భూ
లసమానము లూళ్లు నూఱు నర్ఘ్యము గాఁగన్.

185


ఉ.

మాళవగౌళచోళకురుమాగధు లంపినవారిలోన సం
శీలలఁగా వివేకవరసీమలఁగా రమణీయరూపరే
ఖాలలితాంగవల్లరులఁగా నుడిగంబున కేర్పఱించి భూ
పాలకుఁ డిచ్చె నూఱువుర బాలికలం దనయాలలామకున్.

186


ఉ.

ప్రాణము ప్రాణమైన తనయామణి నప్పుడు చేరఁ బిల్చి యిం
ద్రాణికినైనఁ గంసరిపురాణికినైనఁ గణింపరాని క
ట్టాణి మెఱుంగుముత్తియ మనర్ఘ్యము ముంగరకిచ్చెఁ దల్లియ
క్షీణరుచి ప్రకాండములు చెంగట వెన్నెల గాయుచుండగన్.

187


సీ.

ధగధగాయితరుచిస్థగితనానారత్న
                       సముదీర్ఘరత్నభూషణచయంబు
చిత్రవర్ణాంబరశ్రేణీసమంచిత
                       కాంచనమయపేటికావ్రజంబు
ఘనసారకస్తూరికాసంకుమదపూర్ణ
                       రారజ్యమానకరండసమితి
ప్రచురముక్తాఫలవ్రాతకళాచికా
                       కర్కరికాసముత్కరము మఱియు


గీ.

వివిధవస్తువితానంబు వేఱువేఱ
కంచుకీసంచయంబులు గొంచురాఁగ
సింధుభూభర్త దేవేరి చిఱుత ముద్దుఁ
గూఁతునకు నిచ్చెఁ గోర్కులు గొనలుసాఁగ.

188