పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

రాజశేఖరచరిత్రము


దలఁబ్రా ల్పోసె వసుంధరాధిప కులోత్తంసంబుపై నమ్మహీ
తలనాథుండు నొనర్చె నట్టిపగిదిం దత్తత్క్రియాకేళికల్.

173


గీ.

అట్లు వైవాహికార్హకృత్యములు నెఱపి
నాలుగవనాఁడు సకలబాంధవులుఁ జెలఁగ
నరవరాగ్రణి లోచనానంద మొదవ
నాగవల్లి యొనర్చుటకై గుఱింప.

174


సీ.

ఆణిముత్తియము లొక్కంతగా నొండొండ
                       మేలేర్చి నిండారఁ గీలుకొలిపి
వెలలేనిబ్రాఁతి పచ్చలు దెచ్చి దోయిళ్ళ
                       నించి దట్టంబుగా నెఱపి నెఱపి
నెఱ రంగుగల జాతినీలాలు గుదిగ్రుచ్చి
                       యేనుఁగుల్ చక్కఁగా నేర్పఱించీ
యెదిరి కన్గొనరాని ముదురుఁగెంపులు వోసి
                       తెఱపిఁ గానికలు క్రి క్కిఱియఁబఱపి


గీ.

కలయఁ జొక్కంపుగోమేధికములు నిలిపి
పంచెవన్నెలమ్రుగ్గులు పరిఢవిల్లఁ
బ్రోలు దీర్చిరి చూడ్కి కింపులు ఘటింపఁ
బడతు లత్తఱిఁ బసిఁడికీల్ప్రతిమ లనఁగ.

175


గీ.

కన్నెచనుదోయి చుట్టముల్ గానఁబ్రీతి
వానికళ్యాణవేళకై వచ్చినట్టి
తమ్మిపూమొగ్గలో యనఁ దాల్చి రచటఁ
బూజకుండలు తారకారాజముఖులు.

176


గీ.

సింధుభూపాలు సత్కీర్తి చెలఁగి పద్మ
జాండమవ్వల నీరీతి నావరించుఁ
జూడుఁ డనుమాడ్కిఁ దెల్లనిసున్న మలఁది
మానవతు లందు నిలిపి రైరేని కడవ.

177