పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

రాజశేఖరచరిత్రము


నవనీసురశ్రేణి యాశీర్వచఃప్రౌఢి
                       కోలాహలంబు దిక్కులఁ జెలంగ


గీ.

జయ విశంకటరిపుశైలజంభభేది
జయ త్రిలోకవిస్తారితసారకీర్తి
జయ విలాసవతీపుష్పచాప యనుచు
మది జనవాక్య వైఖరి క్రందుకొనఁగ.

163


గీ.

నగరి మొగసాల కేగె నానరవరుండు
తాను బంధులు సంభృతోత్సాహుఁ డగుచు
నెదురుగా వచ్చి తోడ్కొని యేగుదేర
జూపఱకుఁ జూడ్కు లింపుల జూఱలాడె.

164


ఉ.

ఈజగ మెల్ల నేలుమని యేర్పడఁ జూపెడుభంగిఁ బంకజ
శ్రీజనయిత్రులైన తమచేతులఁ గీల్కొనఁ జేసి రత్నవి
భ్రాజహిరణ్యపాత్రికలు పల్మఱుఁ ద్రిప్పుచు నొయ్యనొయ్య నీ
రాజనముల్ ఘటించి రుడురాజనిభాస్యలు హైమధన్వికిన్.

165


గీ.

చవులు గొలిపెడు ముత్యాలచవికెలోనఁ
బసనివెలిపట్టు నిండారఁ బఱచినట్టి
కనకపీఠికఁ జూపి యజ్జనవిభుండు
చేరి వినయంబు సేయ నాసీనుఁడయ్యె.

166


శా.

డాకేల న్నిజకన్యకామణుల కంఠశ్రేణి గీలించి వీ
క్షాకంజాతము లాత్మపాదనఖరేఖం దార్చి సంగీతవి
ద్యాకౌశల్యము గానరా మదికి నాహ్లాదంబు సంధిల్ల గౌ
రీకళ్యాణము పాడి రప్పుడు పురంధ్రీరత్నముల్ వేడుకన్.

167


శా.

రా రమ్మంచు గడంగి వృద్ధవనితల్ ప్రార్ధింప లజ్జానతా
కారం బంగజసజ్యకార్ముకగతిం గల్పింప నేతెంచి త
న్నీరేజాక్షి కెలంకులం బసిఁడిగిండిం దోయము ల్వోయ న
గ్గారాపల్లుని పాదము ల్గడిగె నక్షయ్యప్రమోదాత్ముఁడై.

168