పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

5


శా.

ఆరూఢోన్నతి నన్నపార్యుఁడును సింగామాత్యుఁడున్ సర్వవీ
ద్యారాజీవభవాకృతిన్ వరదదండాధీశుఁడున్ మంత్రి చూ
డారత్నంబగు మాధవుండు సరిరా డ్వర్గచ్ఛిదాపాదన
శ్రీరామాపరమూర్తి యీతఁ డనఁగా శ్రీరామభద్రాఖ్యుఁడున్.

22


గీ.

అందు వరదయమంత్రి సంక్రందనునకు
గోపమాంబకు నుదయించి రాపగేంద్ర
సన్నిభులు తిమ్మనార్యుఁడు జిన్నతిమ్మ
ఘనుఁడు గొండయమంత్రిపుంగవుఁడు ననఁగ.

23


ఉ.

వారలలోన నగ్రజుఁ డవారితశౌర్యుఁడు తిమ్మమంత్రి మం
రార ముదగ్రదోరసివిదారితదారుణవైరివీరకం
ఠీరవకంఠశోణితధునీఘనఫేనవిభాసితత్పత
ద్భూరిసితాతపత్రరణభూమి యతం డొకమంత్రిమాత్రుఁడే.

24


శా.

నాదిండ్లాన్వయవార్ధిశీతరుచిదానక్షాత్రసంపన్నుఁ డా
శాదంతావళదంతకుంతపటలస్పర్ధాళుసత్కీర్తి నా
నాదేశక్షితిపాలమంత్రికులరత్నం బాశ్రితవ్రాతవీ
క్షాదాక్షిణ్యనివాసభూమి యని లోకఖ్యాతి మించె న్మహిన్.

25


గీ.

సత్యగుణశీలి యమ్మహాసచివమణికి
గృష్ణమాంబకుఁ గోనమంత్రీశ్వరుండు
భాగ్యసంపన్నుఁ డప్పనప్రభుఁడు గోప
దండనాథుండుఁ బుట్టి రుద్దండలీల.

26


ఉ.

ప్రాపితరాజ్యవైభవనిరాకృతపాకవిరోధియైన యా
గోపనమంత్రి ధర్మధనగోపనసమ్మతి గుత్తి దుర్గ ల
క్ష్మీపరిపాలనక్రమసమిద్ధభుజాబలశాలి రూపరే
ఖాపరమత్స్యలాంఛనుఁ డయాహవకార్యధురంధరుం డిలన్.

27


సీ.

శీతలాకృతిఁ గొంత చెప్పంగఁదగుఁ జంద్రు
                       నెలనెల నుష్ణాంశుఁ గలయఁడేని