పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

85


బుండ్రేక్షుఖండశర్కరాఖండక్షీరపూరంబులు నించి యించువిలు
కానిమామకుఁ బ్రేమ నర్పించు కన్నియల తిన్నని యెలుంగుల యల
బలంబులునునై విజృంభించి పంచశరశరసంచయవంచితధైర్యుం
డగుచు నమ్మహీవల్లభుం డాయల్లకభరంబున నుల్లంబు పెల్లగిలం
దురపిల్లుచుండె నంత గాంతిమతియును నత్యంతసంతాపితాంతరంగ
యగుచు వగల నొగులం దగు సఖుల కొప్పగించి యచ్చిలుకఱేఁడు నర
పతిచందం బరయ రయంబున నేతెంచిన.

142


క.

రాచకొమారుఁడు ముద్దుల
రాచిలుకం జూచి పలికె రసవద్వికస
ద్వాచాలమధురమధురిమ
మోచాఫలసార నాకు ముచ్చట దీఱన్.

143


క.

క్షితిపాలకుఁ డే మనియెం
జతురిక యే మనియె నితరసఖు లే మని రా
సతిమణి దా నే మనియెను
మతిశాలీ వేగఁ జెప్పుమా యన నదియున్.

144


సీ.

మనుజేశ యలకేలివనములో మీరంపఁ
                       బనివిని శుద్ధాంతమునకుఁ బోయి
తిమి యటమున్న కాంతిమతీకుమారికా
                       విరహాపలాపముల్ విని నృపాలుఁ
డును దేవియును వచ్చి తనయ చక్కటినుండఁ
                       జతురిక న న్నుంచె నతని యెదుట
నేను దేవరరాక యెఱిఁగింప హర్షించి
                       యచటికి వేవేగ నరుగుదెంచె


గీ.

నిటఁ గుమారిక నన్ను నెంతేని గార
మించి భవదీయగుణము లాలించి పంచ
శరశరాహతిఁ గుందె దుర్భరవియోగ
భరము భరియింపఁజాలక తెరలిపడుచు.

145