పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

83


చక్కని మానవేశ్వరుని చందము చూడరు సువ్వె యొక్కనాఁ
డక్కఱతోడ వానిఁ గలయంగను నంగన భాగ్య మెట్టిదో.

135


క.

అని యపుడు రాజకీరము
వనితామణి నధికమధురవాగమృతాబ్ధిన్
మునిఁగించె నచట మైంధవ
జనపాలకనందనుండు సంభ్రమపరుఁ డై.

136


సీ.

కనకపంజరశారికాకీరకిన్నర
                       ద్వందకోలాహలోత్తాలరవము
ముహుదరనిలోద్ధూతతుహినోదభస్త్రికా
                       పతదంబుకణగణప్లావితంబు
మర్దలౌఘధిమధిమధ్వానగతినట
                       త్కంజధృన్మండలీరంజితంబు
జాలకాంతరలసచ్చందనాగురుధూప
                       సౌరభసంభారసంభృతంబు


గీ.

లలితతోరణమాలికాలంకృతంబు
బహువితానవితానవిభాసితంబు
నైన నవరత్నకీలితహర్మ్య మొకటి
విడిది గావించి యవ్విభు విడియఁ జేసి.

137


క.

తననగరి కరిగె నపు డ
జ్జనపతినందనుఁడు గేళిసౌధస్థలిపై
వనితామణిఁ దలపోయుచు
ననువేల దృఢానురాగుఁ డై యుండుతఱిన్.

138


చ.

పనివడి పద్మినిం బగలు బైకొనియుండుట గాననీక వం
చన నటియించి పశ్చిమదిశారమణిం గలయంగఁ బోవుచో
వనజహితుండు మై తుడిచివైవఁగ రాలు పరాగపుంజమా
యనఁ గనుపట్టె నస్తశిఖరాంతరసీమల సాంధ్యరాగముల్.

139