పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

77


గొనబుగాఁ దిలకంబుఁ గొనగోరఁ దీర్చి య
                       ద్దము చూడ వేటికిఁ దలిరుఁబోఁడి


గీ.

ప్రోది రాయంచ రమ్మని బుజ్జగించి
యాట నేర్పవదేటికి నంబుజాక్షి
మారువేదనఁ దెరలెడి వారిఁ దెగడు
నీకు నీరీతిఁ జెల్లునే నీలవేణి.

106


క.

అని పలికి కలికితొయ్యలి
తనుసంతాపంబు వాపఁ దలఁచి విసవిసన్
జని బిసవిసరముఁ జిగురులు
ననలుం బుప్పొళ్ళుఁ దెచ్చి నైపుణి మెఱయన్.

107


క.

అజ్జలజపత్రనేత్రలు
గొజ్జఁగినీ రుప్పతిల్లఁ గులికిన విరిపూ
సజ్జపయిఁ దార్చునప్పుడు
లజ్జావతి వాడి యొరగు లత యనఁ జరఁగెన్.

108


క.

తరుణి నటఁ దార్చి పై పై
నరవిరులం గ్రుమ్మరించి రంగనలు రతీ
శ్వరమధురధనుర్నీరద
కరకాకాంతములభంగిఁ గానంబడఁగన్.

109


సీ.

చెంగావి గట్ట నెచ్చెలియోర్తు మానంపు
                       రవి గ్రుంక నగు సాంధ్యరాగ మనఁగఁ
గర్పూరరజ మొకకాంత చల్లె వియోగ
                       దహనమహాకీర్తిమహిమ యనగఁ
గలువలు కన్నుల కలఁది యొత్తె నొకర్తు
                       ప్రాణవాయువు లోని కడఁచె ననఁగ
బొండుమల్లియ లొకపొలఁతి రాశిగఁ బోసె
                       నంగజభూతోపహార మనఁగ