పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

రాజశేఖరచరిత్రము


చూచినారలు బుధస్తోమంబు గొనియాడఁ
                       గావ్యనాటకముఖగ్రంథసీమ


గీ.

యేమి చెప్పెడుదాన మీ రిడక లేవు
సకలవిద్యలు భూసురసమితికెల్ల
నజున కెనవత్తు రన్నింట నకట మీర
లల ముకుందుని కన్న నేవెలితి చెపుఁడు.

20


క.

అతని నడవడి చూడరు
గా తామరతంప రగుచు గాదెలఁ గొలుచున్
జేత విడిముడియు బహుగో
వ్రాతంబును గల్గి రాజువడువున నుండున్.

21


క.

పూచిన తంగెడుగతి వి
ద్యాచతురుం డతని సోమిదమ్మ పొరువునన్
వాచాలరత్నకంకణ
సూచితవిభమున మెఱయఁ జూడంగలనే.

22


వ.

అనిన నతం డిట్లనియె.

23


క.

కులమునఁ బడునో బహువి
ద్యలఁ బడునో బుద్ధిఁ బడునొ తరుణీ యేలా
వలవనిదురాశ లెందుం
గలుగదు పో బ్రతుకు పూర్వకర్మముదక్కన్.

24


క.

ఏరికి బుద్ధిబలంబులు
కారణములు గావు సువ్వె కలరె ధరిత్రిన్
నేరిచి బ్రతికినవారలు
నేరక చెడ్డట్టివారు నీరజనేత్రా.

25


ఉ.

సూదిపిఱిందిదార మయి చొచ్చినచోటులు చొచ్చి యేరికిం
గాదనరాదు పూర్వకృతకర్మఫలం బటు గాన నేల ని