పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

45


క.

వలమానమత్తమధుకర
కలహంస క్రౌంచ బకనికాయ గరుత్మ
త్కుల కలకలరవములఁ గొల
కొల మనియెను నొక్క నిండుకొలఁకుం గనియెన్.

121


గీ.

గాంచి యవగాహనము చేసి కనకపంజ
రాంతకీరంబుఁ దివిచి నీ రార్చి తెచ్చి
చాల డస్సితిగా పథశ్రాంతి ననుచు
నృపతి కరమున నెమ్మేను నిమిరి నిమిరి.

122


క.

ఱెక్కల తడి వోనార్చుచు
నక్కునఁ గీల్కొలిపి ముద్దు లాడుచు మది పెం
పెక్కిన వేడుక నందలి
చక్కని హిమవారి చల్లి చల్లనినీడన్.

123


క.

విప్పుగల విధు శిలాస్థలి
జిప్పిలి మకరందరసము చిలికెడు పువ్వుం
జప్పరము క్రింద వైచిన
కప్పురపుందిన్నెపై సుఖస్థితుఁ డగుచున్.

124


క.

భూదయితుఁ డప్పు డశనా
యాదశ జగదేకమాత యభవుని యిల్లా
లాదిమయోగిని యొసంగిన
యాదివ్యమణిం దలంచు నంతటిలోనన్.

125


సీ.

కలికి బేడిస కూటు వలఁ దోలు జిగిగల
                       కన్నుఁగవలఁ గాటుకలు ధరించి
కొదమ తుమ్మెద యొప్పు నదలింపఁగల కప్పు
                       గులుకు పెన్నిరికొప్పు లలవరించి
జక్కవ కవఁగేరఁ జాలిన కుచకోర
                       కముల ముక్తాహారసమితి దాల్చి