పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

43


ల్లొత్తఁగ మాటిమాటికీఁ బయోధరపాళిక నప్పళింపుచున్
దత్తమణీలలామ నిజనందనమై నిమిరెం గరంబునన్.

109


గీ.

అట్లు సమ్మదవిస్మయాయత్త యగుచు
మనుజనాథుని దీవించి మగనిఁ జూచి
యీశుభాకార యీబాల యీసుశీల
మగుడ జన్మించిన ట్లయ్యె మనకు నేఁడు.

110


వ.

అనుచు నప్పరమసాధ్వి పలుకునప్పుడు మునిపత్నులు దమలోన.

111


సీ.

కనకావనీధరకార్ముకవరలబ్ధుఁ
                       డను పెంపుగాంచిన యతఁ డితండు
మునితపష్షష్టాంశమునకుఁ బాత్రుఁడు నాగ
                       నవనియంతయు నేలు నతఁ డితండు
అఖిలకంటకుఁడైన యలవిశంకటదైత్యు
                       నదటు పోకార్చిన యతఁ డితండు
పులినోరి కండయై పోయిన మనభాను
                       మతిఁ గ్రమ్మరించిన యతఁ డితండు


గీ.

చూడ రమ్ము మనోహరశుభచరితుని
భువననయనచకోరికాపూర్ణచంద్రు
సజ్జనావనదాక్షిణ్యజన్మభూమి
యనుచుఁ బొగడుచు దీవింప నాదరమున.

112


గీ.

వచ్చి యచ్చటిమునులకు వందనంబు
లాచరించి నృపాలకుం డాతిథేయ
సత్కృతులు గాంచి యారాత్రి జరపి కాల్య
కృత్యములు దీర్చి మఱునాఁడు ప్రియము దొలఁక.

113


ఉ.

మందరగోత్రధీరుఁ డసమానయశోనిధి రాజలోకసం
క్రందనుఁ డమ్మహామునినికాయము వీడ్కొని వచ్చిత్రోవ మ
ధ్యందినవేళ యైన నతిదాహముచే రథరథ్యపంక్తి దూ
లో దనసారథిం గని జలంధరశౌర్యకళాదురంధరా.

114