పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

రాజశేఖరచరిత్రము


శాంతరూపంబు గైకొన్నశంభురాణి
యమ్మహాకాళి ప్రత్యక్ష మయ్యె నపుడు.

87


గీ.

అట్లు సాక్షాత్కరించిన యఖిలజనని
గాంచి విస్మయసమ్మదాక్రాంతుఁ డగుచు
మనుజనాథుండు సాష్టాంగవినతిఁ జేసి
వేచి కరములు మౌళి గీలించి నిలిపి.

88


దండకము.

జయ జయ జగదీశ్వరీ సంతతానశ్వరీ విశ్వదైశ్వర్యసంకల్పనా
కల్పవల్లీ కృపాఫుల్లమల్లీమతల్లీ కృతోల్లాసయోగీశహృచ్చంచరీకా
విపంచీ నినాదానుమోదా పదారాధనోద్భూతకౌతూహలాయత్త
జంభాసురారాతిశాతోదరీ ముఖ్యలేఖాంగనా మంటలాపుష్పవత్కుం
డలా కుండలి గ్రామణీ కంఠహారప్రియంభావుకా భావుకశ్రేణికా భావు
కాపాదనాయత్తచిత్తా మనోదృగ్విధాజ్ఞాతవృత్తా భవానీ భవానీతఖేద
ద్రుమూలచ్ఛటాచ్ఛేదినీ నిత్యసమ్మోదినీ నిగమవినుతశంభుకళ్యాణ
వేళాబలాలబ్ధశోణాక్షతభ్రాంతికృత్ఫాలనేత్రా సదాసచ్చరిత్రా
భవారాతికిం బ్రీతి కల్పించు నన్నాతియున్ నీవ కావే తమాలప్రభానీలవై
శోణమాణిక్యభాస్వత్కటీచేలవై నేత్రవద్బాలవై యీశునిల్లాల
వైయున్న యాగట్టురాచూలివి న్నీవ కావే సుధాహారవిశ్రాణనోదార
దర్వీకరావిర్భవద్రోహముద్రా సమున్నిద్రశోభాకరా కిన్కచేఁ దాఁకి
యుచ్చండదోర్జండపాండిత్యముల్ చూపి మొండొండ్డినన్ జండముండా
మరారాతులన్ వాతుల న్నెత్తురుల్ గ్రక్కవే త్రొక్కి ఖండించి తన్మస్త
ముల్ హస్తపద్మంబులం బూనవే వేనవేల్దానవు ల్తోడురాఁ బోరులం
బోరు తత్సైరిభాకారఘోరాసురుం బట్టి పెన్దిట్టవై మట్టి, లోకప్రసిద్ధం
బుగా వానిమూర్ధంబు నీపాదపీఠంబుగా నున్పవే నొంపవే బల్విడింగట్టి
శుంభు న్నిశుంభుం గరాంభోజశూలంబునన్ గ్రోలవే, రక్తబీజామర
ద్వేషి. క్రొన్నెత్తు రువ్వెత్తుగా దుర్గునిం ద్రుంచి దుర్గాభిధానంబునుం
జెందనే పొందవే లోకముల్ శాకసంపత్తిమైఁ బ్రోచి శాకంభరీనామ