పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

37


ఉ.

కావుము కావు మోగిరీశకామిని యోజగదేకమాత నీ
లావున నింతకాలము హళాహళి వ్రేయుదు వైరికోటి నేఁ
డీవనసీమ చొచ్చి నను నించుకయేని గణింప కెవ్వఁడో
చేవ నెదిర్చి తుత్తుమురు చేసె మదీయనిశాటసైన్యమున్.

82


ఉ.

అంతటఁ బోక తావకవరాగతలోహతురంగమంబు నిం
తింతలు చేసివైచి తనయేడ్తెఱ చూపిన నిల్వలేక వి
భ్రాంతి వహించి నీచరణపద్మము చేరితి వాఁడె వచ్చెఁ గా
లాంతకుభంగి నాకు నభయంబు దగం గృపచేయు శాంభవీ.

83


క.

అని వాఁడు మఱువుసొచ్చిన
గనికర మొదవంగ భద్రకాళీశ్వరి యో
రినిశాట యోడ కోడకు
మని యూఱడిలంగఁ బలుకు నత్తఱిలోనన్.

84


ఉ.

వాలిన బాహుగర్వమున వానిపిఱుందన పోయి యమ్మహీ
పాలకనందనుండు గుడిబజ్జకునై చని యోరి నిన్ను మ
త్కాలభుజంగతీవ్రతరఖడ్గముచే బలియిత్తు నిమ్మహా
కాళి కురోజకుంభపరికల్పితరక్తకపాలపాళికిన్.

85


వ.

అనుచు నవ్వీరకంఠీరవంబు చనుదెంచిన.

86


సీ.

కొప్పుపై నొప్పెడు కొదమచంద్రునితోడఁ
                       గస్తూరికాతిలకంబుతోడ
సీమంతవిరచితసిందూరరుచితోడ
                       క్రొత్తముత్తియపుఁజేర్చుక్కతోడఁ
దళతళ మను దంతతాటంకములతోడ
                       రమణీయనాగహారములతోడ
గల్లు గల్లను రత్నకంకణంబులతోడఁ
                       జిలుఁగైన చెంగావివలువతోడ


గీ.

ముద్దుమోమున నవ్వుమొలకతోడఁ
జల్లచూపులఁ గరుణారసంబుతోడ