పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

రాజశేఖరచరిత్రము


గలఁచి నృపసైన్యమెల్లఁ జీకాకు పడఁగ
జగతి కంపింప నాలోహసైంధవంబు.

75


మహాస్రగ్ధర.

వ్రచ్చున్ మత్తేభరాజిన్ బ్రకుపితమదహర్యక్షమై
ఘోరభంగిన్
గ్రొచ్చున్ రథ్యవ్రజంబున్ ఘుటఘుట రభటిన్ ఘోణియై పైపయిన్ గా
ర్చిచ్చై యేతెంచి యేర్చున్ జిటజిట మనుచున్ సేనలంగాన మాడ్కిన్
వచ్చుం గార్కొంచు గాఢధ్వని మొగులయితావాన పెన్వెల్లి నిండన్.

76


మ.

అపు డమ్మానవనాథపుత్త్రుఁడు తదీయవ్యగ్రరౌద్రాతిరే
కపరాభూతములైన సైన్యములఁ జక్కం జూచి యీవాజి యే
చి పటాపంచగఁ జేసి సైన్యముల గాసిం బెట్టెడున్ దీని నా
దు పటుక్రూరశరాహతిం దుము రొనర్తున్ దానవు ల్బెగ్గిలన్.

77


మ.

అని యూహించి తదీయసైంధవముపై నాగ్నేయబాణంబు వై
చినఁ దద్దేహము నీరుగాఁ గరఁచుటన్ జింతాకులస్వాంతుఁడై
దనుజుం డీతఁ డజేయుఁ డంచు నిజదోర్దర్పంబు చాలించి హె
చ్చినభీతిం బరువెత్తి తద్బిలము చొచ్చెన్ దివ్యు లుప్పొంగఁగన్.

78


ఉ.

చొచ్చినఁ బోకు పోకు మనుచున్ నృపకేసరి తేరు డిగ్గి
వెచ్చటి కేగినన్ విడుతునే పటుబాణపరంపరాహతిన్
బచ్చడి చేయువాఁడ నని ఫాలనటద్భృకుటీకరాళుఁ డై
యిచ్చ నొకించుకేనిఁ జలియింపక తద్బిలవీథిఁ దూఱఁగన్.

79


శా.

ఆలోమాయ ఘటించి యాదితిసుతుం డాభీలకాలానల
జ్వాలోదగ్రవిషంబు గ్రక్కుచు ఫణవ్యాకీర్ణరత్నప్రభల్
క్రాలం గ్రూరభుజంగమై యరుగుదేరం జూచి యమ్మాయ వే
వ్రీలం జేసె మునీంద్రసూచితమహావిద్యాప్రభావంబునన్.

80


ఉ.

సాహసికాగ్రగామి నృపసత్తముఁ డట్లు తదీయఘోరమా
యాహమికల్ హరింపుచు నిరంకుశవిక్రమకేళి చూప ను
త్సాహము దక్కి యాత్మపురి చక్కటి కేగఁగ నొక్కకాళికా
గేహము చొచ్చి యద్దనుజకీటము పాటిలు భీతిపెంపునన్.

81