పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

33


గీ.

అపుడు సాయంతనార్హకృత్యములు నెఱపి
యేకతంబున్న ధాత్రీతలేంద్రుకడకు
నమ్మహామౌని యేతెంచి యవనినాథ
దనుజమాయల కొకవేరె యనువు వినుము.

65


క.

మాయాభేదిని యన భూ
నాయక యొకవిద్య గలదు నాయెడ వివిధో
పాయవిధానవిధి న్నేఁ
జేయుదు నుపదేశ మిష్టసిద్ధి ఘటింపన్.

66


గీ.

అని సలక్షణభంగి నమ్మునివరేణ్యు
డమ్మహావిద్య నుపదేశ మాచరింప
నియతిఁ గైకొని కౌతుకోన్నిద్రుఁ డగుచు
నవనినాథుఁడు సుఖసుప్తుఁ డయ్యె నంత.

67


సీ.

తొలఁగు నీరీతి దైత్యులమాయ లని చూపు
                       విధమునఁ జీఁకటి విచ్చివోయె
జరగు నీరీతి నిశాటఫాలాక్షర
                       పంక్తినాఁ దారకాపటలిఁ విరిసెఁ
దలకు నీగతి యాతుధానులప్రాణంబు
                       లను జాడఁ బొలసె మందానిలంబు
దరికొను నిబ్భంగి దైత్యులహృదయంబు
                       లను మాడ్కి నర్కోపలాలి మండె


గీ.

దనుజశుద్ధాంతకాంతావితానవక్ర
కాంతి యీపోల్కిఁ బొలియు నాఁ గమలవైరి
తనకళాస్ఫూర్తి యంతకంతకుఁ దొలంగె
వరుణ దిగ్విధి కడఁజేరి వాడఁబాఱె.

68


గీ.

సవిధకీర్ణపరాగాగ్ని సాక్షి గాఁగఁ
దమ్మివిందు కరగ్రహణ మ్మొనర్పఁ