పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

25


క.

కినుక మెయి నిపుడు మిమ్ముం
గనుగాన కలంచి నట్టి గర్వాంధునిఁ దు
త్తునియలు గానించెద నే
ననఘా వినిపింపు మనిన నతఁ డి ట్లనియెన్.

25


ఉ.

ఏమని చెప్పువాఁడ ధరణీశ్వర యే వరతంతు సంయమి
గ్రామణి శిష్యుఁడన్ జటిల కౌశికుఁడన్ బహువేదశాస్త్రవి
ద్యామహనీయుఁడన్ బదరికాశ్రమవాసుఁడఁ బుత్త్రికామణిన్
గోమలపాణి భానుమతిఁ గోల్పడి వచ్చినవాఁడ నక్కటా.

26


ఉ.

నీకరుణవిశేషమున నెమ్మది నేమి కొఱంత లేక య
స్తోకతపోవిధానములు చూఱలు పట్టి సమస్తతాపసా
నీకము నేఁటిదాఁక నతినిశ్చలతన్ వసియించె నిప్పు డ
స్వీకృతనిత్యకర్మమయి చిక్కె విశంకటదైత్యబాధలన్.

27


సీ.

వినవయ్య ధరణీశ విరివియై కవ్వంపుఁ
                       గొండచేరువ నొక్కకోన గలదు
బెడఁగైన యక్కోన నడుచక్కి మిక్కిలి
                       భీకరంబగు నొక్కబిలము గలదు
తలకింతయును లేక తద్బిలద్వారంబు
                       సరణిఁబో నొకరక్తసరసి గలదు
ఘోరతరం బైన యారక్తసరసి వెం
                       బడిఁ బోవ నట నొక్కబయలు గలదు


గీ.

పరభయంకర మం దొక్కపురము గలదు
తత్పురంబుననుండి సంతతము వచ్చి
యాత్మతరుణి కూడిగము చేయంగవలసి
పొంచి సవరల పాపలఁ గొంచుపోవు.

28


శా.

కాళీదత్తకఠారలోహమయకంఖాణంబుపై నెక్కి దం
భోళి క్రూరకరాసిఁ ద్రిప్పుచు గళోద్భూతచ్చటాకారముల్