పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

రాజశేఖరచరిత్రము


యౌవరాజ్యాభి షిక్తుఁడై యతిశయిల్లె
నఖిలవిద్యానిరూఢిఁ బెం పంది యతఁడు.

10


ఉ.

రామునికంటె నప్పరశురామునికంటె ధనుర్విశేషవి
ద్యామహనీయుఁడై మెఱసి యాతఁడు చేతుల తీటవో సము
ద్దామవిరోధిబాహుజవితానము నుక్కడఁగించి వీర ల
క్ష్మి మదిరాక్షికిన్ వలపు గీల్కొలిపెన్ విషమాస్త్రకేళికిన్.

11


సీ.

కలహభోజన మునిగ్రామణి యాకంట
                       నానాఁట నిటమీఁద నవయకున్నె
దళితారి రక్తాపగలు నిండి పాఱమి
                       వారధు లిటమీఁదఁ జెలఁగకున్నె
నిజమండలోద్బేధనిర్వేదములు మాని
                       నలినాప్తుఁ డిటమీఁదఁ జెలఁగకున్నె
రంభానిరంతరరతికేళిఁ బౌలస్త్య
                       నందనుం డిటమీఁదఁ బొందకున్నె


గీ.

యనఘ దర్పితపరిపంథి మనుజపతుల
బీరములు మాన్పి తనపాదపీఠిఁ జేరి
కప్పములు పెట్టి కొలువ నిష్కంటకముగ
ధాత్రి పాలించె భువనైకజైత్రుఁ డగుచు.

12


వ.

ఇవ్విధంబున, బ్రజాపాలనంబు చేయుచుండునంత నొక్కనాఁడు హే
మధన్వమహీపాలుండు పేరోలగంబుండు సమయంబున.

13


చ.

కనుఁగవ నిప్పుకల్ చెదరఁగా నదరుల్ వెదచల్లు కెంజడల్
పెనఁగొన నక్షహారములు బిట్టుగ నిట్టటు లూగ నెంతయున్
గినుక వహించి యొక్కముని కేసరిగొబ్బునఁ జేరవచ్చె న
జ్జనపతియున్ సభాసదులు సాధ్వసమంది వడంకునట్లుగన్.

14


గీ.

అమ్మహామౌని వచ్చిన యాగ్రహంబు
డెంద మవియింప గద్దియ డిగ్గి మ్రొక్క