పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17


జనకంబైన ఫలంబు మౌళినిడి వక్షఃపీఠిపైఁ దార్చి లో
చనయుగ్మంబునఁ జేర్చుచుం బొగడుచున్ సంతోషితస్వాంతుఁడై.

79


ఉ.

పాలిక మేలుకొల్పి నరపాలశిఖామణి వింటివే వినీ
లాలక నిన్నరేయి యొకయచ్చెరు వాశ్రితపారిజాత మ
బ్బాలశశాంకమౌళి మనపాలికి కొంగుపసిండి మందమం
దాలసలీల వచ్చె దరహాసవిభాసిముఖారవిందుఁడై.

80


క.

వచ్చి భవద్భక్తికి నే
మెచ్చితి నీఫలము నీసమీహిత మొసఁగున్
బుచ్చుకొను మనుచుఁ జేతికి
నిచ్చి భవానీశుఁ డరిగెనే లలితాంగీ.

81


క.

అని పలికి యభవుడిచ్చిన
యనర్ఘ్యఫలము విభుఁ డిచ్చె నాత్మాంగన కెం
దును శివభక్తులకును గలఁ
గనిన ఫలం బెన్న నిజముగాఁ జేకుఱుఁగా.

82


ఉ.

ఇచ్చిన మ్రొక్కి పుచ్చుకొని యింపును సొంపును బల్లవింపఁగా
నచ్చపలాయతేక్షణ శివార్పణమంచు సుధారసంబుతో
మచ్ఛరికింపఁజాలు రుచి మత్ఫల మాదట నారగించి వా
క్రుచ్చఁగరాని మోదమునకు న్నెలవై పెనుపొందె నంతటన్.

83


సీ.

చూపుఁ దేటుల పిల్లలూ పాడఁజొచ్చెఁబో
                       యాడక యనియేల యడఁగియుండుఁ
జనుఁగవ జక్కవల్ పెనుపొంది యుబ్బెఁబో
                       యుబ్బక యవియేల యూరకుడు
వేణికానీలాహివిస్ఫూర్తి మించెఁబో
                       మించక యదియేల మిన్నకుండు
చిఱునవ్వు మొలకలు చిగురొత్తఁ దలఁచెఁబో
                       తలఁపక యవియేల నలఁగియుండు