పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

రాజశేఖరచరిత్రము


మృగమదపంకంబు మేననిండ నలంది
                       మేలేర్చి క్రొవ్విరుల్ గీలుకొలిపి


గీ.

ధూపమర్పించి కర్పూరదీప మొసఁగి
యమృతదివ్యాన్నరుచిరోపహార మిచ్చి
వనితయును దాను సాష్టాంగవినతిఁ జేసి
చంద్రధరుఁ గొల్చు నా రాజచంద్రుఁ డెపుడు.

73


శా.

రాజచ్చంద్రశిలాతలాంతరలతారమ్యప్రదేశంబులన్
గాజుంగుప్పెలలోని యచ్ఛతరగంగావారి నోలార్చి యా
రాజుం దేవియు మంత్రపూతముగ హేరాళంపుఁబూగుత్తులన్
బూజల్ సేయుదు రిచ్చలం జెలఁగి ముప్పూటం బురారాతికిన్.

74


క.

సంతానకాంక్ష నాశ్రిత
చింతామణి సకలలోకసేవితుఁ గరుణా
స్వాంతుని రాజతశైలని
శాంతుని భజియింతు రెపుడు సతియున్ బతియున్.

75


క.

ఆమానవపతి చిత్తా
రామములో నుండమరగి రాజతభూభృ
త్సీమకయి పోఁదలంపక
సోమకళాధరుఁడు మిగులసోమరి యయ్యెన్.

76


వ.

ఇవ్విధంబున బరమశైవాచారసంపన్ను లగు దంపతు లప్పరమేశ్వ
రుని సేవింప నొక్కనాఁడు.

77


చ.

కలగని యమ్మహీవిభుఁడు గ్రక్కున లేచి నిజంబుగా మదిన్
దలఁపుచు మేను గర్పొడవ నల్గడలుం బరికించి యోకృపా
జలనిధి యోమునీంద్రవరసంస్తుత యోజగదేకనాథ నిన్
గల గనుగొంటిఁ దొంటి కలికల్మషజాలము వీడుకొంటినే.

78


మ.

అని యంతంతకు నమ్మహామహిమ కత్యాశ్చర్యముం బొంది య
జ్జననాథాగ్రణి పాహిపాహి యనుచున్ సంతాన దానక్రియా