పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7


గీ.

కపటరాజన్యమంత్రిదుర్వర్గభార
తిమిరపటలంబు శేముషీతీవ్రభాను
భానుమాలికచేఁ బటాపంచ చేసి
వెలసినాఁడన నప్పన వినుతిఁ గాంచె.

31


మ.

పలుమా ఱంబుధరంబు చూపు బహురూపం బంబరాసక్తి శీ
తలభానుండును బొట్టపెంచుటకు నై తాల్చుం గళాప్రౌఢి ని
చ్చలు వారింపఁ జరించువారినిధి యాశాబద్ధుఁడై వీరలన్
దిలకింపందగునోటు దాతలని నాదిండ్లప్పనిం జెప్పుచోన్.

32


సీ.

ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియా
                       తత్పరమానసోత్సాహశాలి
యేమంత్రి మణిమిత్రహితబాంధవాశ్రిత
                       ప్రకటరక్షణకళాప్రౌఢిబుద్ధి
యేమంత్రిమణి వచోహేలాతినైర్మల్య
                       శీతలతాధూతశీతరోచి
యేమంత్రిమణి సుధాధామశాంభవధామ
                       ధాళధళ్యసుతుల్యధవళకీర్తి


గీ.

యట్టి మంత్రికులోత్తంస మహితనృపతి
పటలమకుటాగ్రఘటితపత్పద్మయుగళి
సకలకర్ణాటరక్షావిచక్షణుండు
దీనసురశాఖి సాళువ తిమ్మమంత్రి.

33


గీ.

అమ్మహామంత్రి కతని యర్ధాంగలక్ష్మి
సకలపుణ్యాంగనాజనశ్లాఘనీయ
లక్ష్మమాంబకు నుదయించి లలిని మెఱము
తిరుమలాంబికఁ బెండ్లియై తేజరిల్లె.

34


ఉ.

చెప్పెడిదేమి నవ్వుచు రచించిన మాటలు రాము బాణముల్
దప్పినఁ దప్పఁ డాశ్రితకలాపము ముంగిట నున్నవేలుపుం