పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

103


ద్దులకోడలిఁ జెయిపట్టుకొ
ని లీలమైఁ జనియె నిచట నృపతియుఁ బ్రేతిన్.

228


శా.

ఓనిర్నిద్రభుజప్రతాపతపనా యోబంధుచింతామణీ
యోనారీమకరాంక యేపగిది నయ్యుగ్రాసురున్ గెల్చితో
మౌనిశ్రేష్ఠుని పట్టి నెట్టికరణిన్ మళ్ళించితో సర్వమున్
వీను ల్చల్లఁగఁ జెప్పుమన్న నతఁ డావిర్భూతసమ్మోదియై.

229


క.

రాచిల్కమోము చూచుడు
నాచందం బది యెఱింగి యవనీశ్వరుతోఁ
దూచాతప్పక యుండఁగ
వాచాగోచరవిశేషవైఖరి మెఱయన్.

230


సీ.

తొలితొలిఁ గవ్వంపుమలకు నేగి విశంక
                       టుని భుజదర్ప మార్చినవిధంబుఁ
బ్రత్యక్షమై దివ్యరత్నంబుఁ గాళి యి
                       చ్చినయట్టివిధమును దనవిధంబు
ముష్టింపచస్వామి ముద్దుఁగూఁతును దెచ్చి
                       యతని కర్పించిన యవ్విధంబుఁ
బదరికాశ్రమభూమిఁ బారికాంక్షులచేత
                       దీపనల్ చాలఁ జెందినవిధంబు


గీ.

నుత్సవాహ్వయవనసీమ నున్నవిధము
భవ్యగుణధన్య సింధుభూపాలకన్యం
బెండ్లియాడిన విధము నొప్పిదము గాఁగఁ
దేటపడఁ జెప్పె రాచిల్కమేటి యచట.

231


వ.

అట్లు పలికిన యక్కీరసునాసీరు మెచ్చుల పల్కుల కమ్మహీ
భృచ్చతురాననుం డిచ్చ నచ్చెరు వంది నిష్పందానందకందళిత
హృదయారవిందుండై సుఖం బుండె, నట రాజశేఖరకుమారుండును
గాంతిమతీకుమారికాసమేతుండై.

232