పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

రాజశేఖరచరిత్రము


పల్లతి కాశితాసి పరిపాండురకీర్తి ససంభ్రమంబునన్
దల్లికిఁ దండ్రికిన్ గురుజనంబులకున్ ధర జాగి మ్రొక్కుడున్.

221


ఉ.

గ్రుచ్చి కవుంగిలించుకొని కోరిక లీరిక లెత్త నమ్మహీ
భృచ్చతురాననుం డనియె భీకరదైత్యుల నుక్కడంచి నీ
వచ్చుటఁ జేసి ప్రాణములు వచ్చెఁ జుమీ యిట నేఁడు మాకు వి
వ్వచ్చుఁడు పోరులన్ సవతు వచ్చునె నీ కసమాసమానుషా.

222


మ.

రణసీమన్ సురకోటి నొంచి ఖచరవ్రాతంబుఁ దూలించి చా
రణులం దర్ప మడంచి బాహుబలగర్వస్ఫూర్తి మార్లేక భీ
షణవృత్తిన్ విహరించు దైత్యు నొరులే సంధించువా రీవు కా
రణజన్ముడవు గానఁ గూల్చితి కుమారా రాజకంఠీరవా.

223


వ.

అని బహువిధంబులం బ్రశంసించి పునఃపునరాలింగనం బొనరించి
యన్నరదేవుండు దేవియుం దానును బరమానందంబునం బొంది
యుండ.

224


క.

కోమలపల్లవపాణిం
గోమలి నమ్ముద్దుఁబెండ్లికూఁతును నొకమై
దా మొయ్యఁ దార్చియత్తకు
మామకు మ్రొక్కించి రపుడు మంజులవాణుల్.

225


క.

మ్రొక్కిన కోడలిఁ గొమ్మం
జక్కనిజవరాలిఁ జూచి సతియును బతియున్
మిక్కిలి యక్కఱ మీఱన్
బెక్కువిధంబుల నుతించి పేశలఫణితిన్.

226


క.

రావమ్మ సింధుపుత్త్రీ
పావనచారిత్ర నేత్రపర్వము గాఁగన్
నీవునుఁ బతియును దేవియు
దేవరవలె నుండుఁ డనుచు దీవించి తగన్.

227


క.

కులదేవతానమస్కృతి
సలు పన్నరనాథుదేవి చక్కని తన ము