పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

రాజశేఖరచరిత్రము


యనఘుఁడ కారణబంధుం
డని తెలియం బలికి గుండియ దిగు ల్లనఁగన్.

214


క.

తలగ్రుచ్చి కౌఁగిలించుచుఁ
దెలిగన్నులనీరు దుడిచి దీవించి నినున్
నలువదినాళ్ళకె తోడనె
పిలిపించెద నింతయేల బెగడకు తల్లీ.

215


గీ.

అనుచు నూరార్చి పదవమ్మ యనుచుఁ దానుఁ
బ్రాణసఖులును గక్ష్యాంతరములు గడచి
దిడ్డివైచిన యొకనూత్నదివ్యరత్న
ఖచిత మగు పల్లకీమీఁదఁ గన్నె నునిచి.

216


గీ.

ఎట్టకేలకు నప్పు డయ్యింతి యంతి
పురములోనికి వసివాడి యరిగె మగిడి
మగిడి చూచుచు నెంతయు మహిమ నిచటఁ
గంచుకులవాక్యవైఖరి గ్రందుకొనఁగ.

217


గీ.

వల్లకీపాణి పల్లకి యల్ల నల్ల
బురము వెల్వడ సింధుభూవరుఁడు దాను
దండనాథులు సకలబాంధవులు వెంట
లీలమై నేగి రపుడ తేజీల నెక్కి.

218


సీ.

ఆరీతి నేగి ము న్నఖిలసేనాసమే
                       తుఁడయి వెలిని వీడు విడిసియున్న
మనువంశపతిఁ జేరఁ జని ముద్దుఁగూఁతును
                       నప్పగించి విచార మావహిల్ల
నొకభంగి నేగె నయ్యుర్వీతలాధ్యక్షుఁ
                       డిట హైమధన్వియుఁ జటులపటహ
మురజమర్దలరావములు మిన్నుముట్టఁగ
                       గన్యకాసహితుఁడై కతిపయప్ర