పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

93


క.

కుటిలాలక నీపుత్త్రిక
యఁట యెట గుణశీల గరిమ మడుగఁగ నేలా
నిటలాంబకకులకాంతకు
నిటువంటి వివేక మేది యే నెఱుఁగుదుగా.

208


గీ.

ఉభయవంశపవిత్ర యీయుత్పలాక్షి
సర్వలక్షణసౌభాగ్యజన్మసీమ
యీకుమారిక చొచ్చిన యిల్లుఁ బుట్టి
నిల్లు నెంతయు వన్నెకు నెక్కకున్నె.

209


క.

పతియునుఁ దా నన్యోన్య
స్థితి నిప్పుడ కలసి మెలసి చెలులన్ మనలన్
మతి నొకనాఁడుఁ దలంపదు
గత మిచ్చెద దీని కేమి కంజాతముఖీ.

210


క.

పట్టానదేవియై నీ
పట్టి జగం బెల్ల మెచ్చఁ బతిమానస మి
ట్టట్టు చననీక యన్నిట
జట్టిగొనన్నేర్చు నీవు సంతసమందన్.

211


క.

దినముల వెంబడి నన్నియు
వినియెద వేటికి వచింప విభునింటికి నీ
మనసునఁ దెలివిడి గూఁతుం
బనుపుమనం దనయఁ జూచి పైకొను మమతన్.

212


గీ.

అమ్మహారాజుదేవి యిట్లనియె మగుడ
నన్ను మన్నించి యీశుకనాథుపల్కు
లేమి జవదాటకుండుమీ యిదియ నీకు
బరమమైనట్టి బుద్ధిపోఁ బద్మగంధి.

213


క.

మనమున దయపుట్టఁగ నీ
పనిపాటలు విన్నవించుఁ బ్రాణేశున కీ