పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

రాజశేఖరచరిత్రము


వ.

అని యద్దేవేరి తనముద్దుఁగూఁతునకుఁ బెద్దయు బుద్దులు చెప్పి యచ్చి
లుకఱేని మొగంబై యిట్లనియె.

203


క.

మాపాలి భాగ్యదేవత
వై పేరునుఁ బెంపుఁగల మహారాజునకున్
జేపట్టి పెండ్లి చేసితి
వీపావను నిన్ను వేఱ యేటికిఁ బొగడన్.

204


సీ.

అనునయోక్తులు వల్కి యత్తమామల కాత్మ
                       గృప పుట్టఁగా నప్పగింపపయ్య
సకలబంధులకు వంచన లేక వినయంబు
                       సేయఁ బల్మరు బుద్ధి చెప్పవయ్య
పతి చిత్తవృత్తిగా సతతంబు విసువక
                       సేవ యొనర్ప శాసింపవయ్య
కినిసి యెవ్వారి నొచ్చిన నోరఁబల్కక
                       యోర్పుమై నుండంగ నేర్పవయ్య


గీ.

యెల్లవారలవలె నేమి యెఱుఁగవయ్య
నిన్నియును నేల నీచేతి కిచ్చినార
మీకుమారిక మీచిత్త మెట్లు వచ్చు
నట్టిజాడలఁ గరుణఁ జేపట్టవయ్య.

205


క.

పలుమఱు నీగతి నవ్విభు
కులపాలిక బుద్ది చెప్పి గుణశాలికి న
ప్పలుకుం దేనియ కొలఁకుకుఁ
జిలుకకుఁ దగ నప్పగించెఁ జిలుకలకొలికిన్.

206


క.

అప్పుడు శుకకులచంద్రుం
డప్పాటలగంధి కనియె నంగన ప్రియముల్
చొప్పడఁ బెఱవారికి బలెఁ
జెప్పెదు నన్నింత వేఱు సేయం దగునే.

207