| తే. | నమర నిమ్నగానిత్యసేకముల నెలయు, జడలలేఁగెంపు విమలతఁ గడు మెఱయఁగ | |
ఆ-3. ప-34.
ఇందు రామాయణార్థమున నగస్త్యపరముగా నన్వయించునపుడు దివి మోచియున్న యద్రిని = అభ్రంకష మయిన వింధ్యపర్వతము ననియు, భారతార్థమున శివపరముగా నన్వయించునపుడు స్వర్గలోకమును వహించిన మేరుపర్వతము ననియు శబ్దశ్లేష గాని యర్థశ్లేష గాని పదాన్వయభేదము గాని లేకయే యర్థాన్వయము భిన్నభిన్నముగాఁ గలుగునట్లు కల్పించుటం జేసి యిచ్చట నర్దాన్వయభేదకల్పనంబు సూచింపఁబడియె. ఇదియు ముఖ్యగౌణవృత్తిశ్లేష కుదాహరణ మగునని తలఁచునెడఁ దద్విభేదమునే కవి చమత్కారార్థముగాఁ బ్రకారాంతరముగా గణించె ననియుఁ దలఁపఁదగియుండెడు. కవి కల్పించినయితరభేదకల్పనలతో దేనిలోనైనం గలియనియర్థాన్వయభేదకల్పన కుదాహరణము మృగ్య మని యూహించుచున్నాఁడను. విద్వాంసులు విమర్శించి గుణదోషముల నరసి తత్త్వము నిర్ణయింతురని సవినయముగ వేఁడుచున్నాఁడను.
| సీ. | “వ్యధలెల్లఁ దీఱ దేవరమహామహిమ వి, లోకింపఁ గంటి నస్తోకగుణత | |
| ఆ. | బాఱు తెంచితి నని ప్రత్యభిజ్ఞానస, మర్పణమున నతనిమది యొడఁబడఁ | |
ఆ-4. ప-38.
ఇందు రామాయణార్థమున 'దేవరమహామహిమన్, వ్యధ లెల్లఁ దీఱన్, అస్తోకగుణతఁ బరఁగుభూమిజన్, విలోకింపఁ గంటి'ననియు, భారతార్థమున ‘వ్యధలెల్లఁ దీఱన్, దేవరమహామహిమన్, విలోకింపఁ గంటిన్, అస్తోకగుణతఁ బరఁగుభూమిజనాధిపతనయా' యనియుఁ బదముల కర్థభేదము లేకున్నను శబ్దాన్వయభేదపూర్వకముగాఁ గర్మకరణహేత్వాదిభేదకల్పనచే నర్థద్వయముఁ బొసఁగించుటం జేసి యిచ్చట శబ్దాన్వయభేదసంగతి చెప్పఁబడియె. ఈపద్యమందే చతుర్ధపాదమున నిట్టిరచన యింకనుం గలదు.