| | మారు దుశ్చేష్టితంబు నివారితముగఁ | |
ఇందు భారతార్థమున శ్రీకృష్ణుడు రాయబారము చేయునపుడు ధృతరాష్ట్రునకు దుర్యోధనుదుశ్చారిత్ర ముగ్గడించి చెప్పునప్పుడు ఖేదాశ్చర్యసూచకముగా లోకసాధారణ మగువాడుకమెయి “శ్రీరామరామ” యను సంబోధనద్యయముం బ్రయోగించుట యత్యంతచమత్కారంబు గావించెడు.
రామాయణభారతకథాసంఘటనంబునఁ బ్రసంగవశమున నగరార్ణవాదిమహాకావ్యలక్షణంబులకుఁ బ్రస్తావ మిం దచ్చటచ్చటఁ గలిగి యరయు విద్వాంసులకు గోచరంబులై యుండెడు.
ఈకవిచంద్రుం డింతనియవాముతోఁ గథాద్వయముం గూర్చి గ్రంథమును రచియించుచుం గావ్వకన్య కలంకార మొడఁగూర్చు నర్థాలంకారములం గూడ నచ్చటచ్చటఁ బొందుపఱిచియున్నాఁడు. ఒక్కొక్కచో నొక్కొక్కయలంకారము మాత్రమేగాక రెండు మూఁడుం బర్సంగవశమునం గూడినపుడు సంసృష్టిసంకరప్రకారంబులు నచ్చటచ్చట నూహ్యంబులై యుండెడు. వీనికిం గొన్ని యుదాహరణములు దిక్ప్రదర్శనముగC జూాపుచున్నాఁడను.
| మ. | “తలఁపం జొప్పడి యొప్పె నప్పుడు తదుద్యజ్జైత్రయాత్రాసము | |
ఇందొక్కటిరెండువర్ణములకుఁ బలుమా ఱావృత్తిఁ గావించుటంజేసి వృత్త్యనుప్రాసాలంకారము.
| రగడ. | “పొలిచె మధులక్ష్మి సురపొన్నలను జొన్నలను | |
అ-2. ప-6.
ఇందు ఛేకానుప్రాసాలంకారము.
శబ్దాలంకారములచే రసపుష్టి గలుగ దాని వానియెడఁ గవుల కంతగ సాదర ముదయింపదు గావున శబ్దాలంకారవిచార మిఁ