పుట:మ ధు క ల శ మ్.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

".....మధువెండును పిమ్మట గాన మాగు గాయనులును
నిద్రవోదురు లయశ్రుతులున్ చెవికంద వాపయిన్" అని ఎంతో
రసవంతంగా వివృతంచేశారు. 51-వ పద్యంలో :

"Nor thy Tears wash out a Word of it" అన్నచోట,

"...... ఆలిఖితంబున నొక్క ముక్కయున్ చెఱగదు నీదు
బాష్పములు చెర్వయి వాగయి వెల్లిపోయినన్," అని అనువదిం
చారు. ఈ సందర్భాలన్నిటిలో శ్రీ సుబ్బారావుగారి తెలుగు
పద్యాలు చదివి చదివి మహదానందాన్ని పొందినాను. వీరు తమ
కావ్యమంతా చంపకమాల, ఉత్పలమాల వంటి వృత్తాలలో వ్రా
శారు. ఆంగ్లంలోని ఫిట్సు గెరాల్డు పద్యాల నడకకు సాధ్యమైనంత
సామీప్యంలో ఉన్నవి మన వృత్తాలే.

ఇంకొక విశేషం. ఫార్షీలోగాని, ఆంగ్లంలోగాని లేని ఒక
నూతన పద్ధతి వీరి కావ్యంలో కనిపిస్తున్నది. ఉమరు తన కావ్యాన్ని
ఒక్కసారిగా వ్రాయలేదు. ఎప్పుడో బుద్ధిపుట్టినప్పుడు ఏవో కొన్ని
భావాలను ప్రకటించేవాడు. వేమనపద్యాలవలెనే, ఉమరు పద్యాలు
ఐక్యత (Unity)గల కావ్యంగా ఏర్పడవు. శ్రీ సుబ్బారావుగారు
చాలావరకు ఉమరు తన ప్రియురాలిని సంబోధించినట్లుగా ఒక