పుట:మీగడతరకలు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈశ్వరుడు - శనైశ్చరుఁడు


 సిరులు చెలరంగ కై లాసశిఖరిమీఁద
ప్రమథగణములు సేవింప ప్రమద మలర
పార్వతీసహితుం డయి పరమశివుఁడు
నిండుకొలువును దీర్చి కూర్చుండియుండె.

అంత నచటికి శని వచ్చి, " పంత మొప్ప
నేను తలఁచితి." , యెట్టి వాని - నైన
కొందలము గూర్చి దైన్యంబు నొందఁ జేసి
పట్టి పీడింతుఁ గా " కని ప్రతిన వట్టె.

అతని ప్రజ్ఞ బరీక్షింప ననియె శివుఁడు:
" ఓయి నను గూడ దైన్యంబు నొందఁ జేయఁ
గలవె  ? అటులైన మాసంబు గడువు నిత్తు,
ఏదిచూచెద చూపుమా నీదుమహిమ "

36