పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా!
అని భగవదంకితంచేసి, విశిష్టాద్వైతమందలి పరతత్త్వమును ప్రబోధించారు పోతన. తంజావూరు తెలుగు కవులు పై ఆళ్వారుల సంప్రదాయ ప్రభావం వలన వైష్ణవ సంబంధమైన కావ్యాలు తీసుకువచ్చారు. నాయకరాజుల కాలములో తంజావూరు రాజ్యంలో వీర వైష్ణవం మహోన్నత స్థితికి చేరుకుంది. ఇచ్చట రాజులు కూడా వీర వైష్ణవులు. వీరి ప్రోత్సాహంతో వీరవైష్ణవం బాగా ప్రచారంలోకి వచ్చింది.
విజయ రాఘవుని మతావేశము అంతా రాయించిన విజయ రాఘవ నాయకుడు. తండ్రిని మించిన వీర వైష్ణవుడు. తంజావూరు రాజుల ప్రభావం అచట కవుల, రచయితలపై పడింది. ఇతర మతములను నిరసించి యిలన వెలయ వైష్ణవ మతం నిలపై శాశ్వతముగా అని రంగాజమ్మ అన్నారు. దాని విలాసమందు నుడివిన మాటల సత్యం నాయకరాజుల కాలమునందు తంజావూరు రాజ్యంలో వీర వైష్ణవం మహోన్నత స్థితికి చేరుకుంది. వీరంతా వీర వైష్ణవులు కావడంతో వైష్ణవ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించి ప్రచారంలోకి తీసుకువచ్చారు.
37