Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సన్యాసి అయ్యారు.

ఈ సమయంలో, చాలా వృద్ధులైన యామునాచార్యులు శ్రీరంగంలోని మఠానికి అధిపతిగా తన స్థానంలో మంచి సామర్థ్యం మరియు గుణమున్న యువకుడి కోసం వెతుకుతున్నారు. అతను అప్పటికే తన శిష్యుల ద్వారా రామానుజుల గురించి విన్నారు. మఠానికి ఆయన తన స్థానంలో రామానుజుని మఠాధిపధిగా నియమించాలని నిర్ణయించుకున్నాడు. రామానుజుల వారిని తీసుకురమ్మని వ్యక్తులను పంపాడు. రామానుజులు శ్రీరంగం చేరుకునే సమయానికి, యామునాచార్యులు చనిపోయారు. ఆ సమయంలో యామునాచార్యులవారి మృతదేహాన్ని ఆయన అనుచరులు గ్రామం వెలుపల ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లడం రామానుజులు చూశారు. రామానుజులు కూడా వారిని అనుసరించి శ్మశాన వాటికకు చేరుకున్నారు. యమునాచార్య తన మరణానికి ముందు, రామానుజులు నెరవేర్చవలసిన మూడు కోరికలను రామానుజులకు వదిలి వెళ్ళారు. అవి ఒకటి - వ్యాసుని బ్రహ్మసూత్రాల కోసం ఒక విశిష్టాద్వైత భాష్యాన్ని వ్రాయవలసి ఉందని; రెండు విశిష్టాద్వైత తత్త్వాన్ని శిష్యులకు ఉపదేశించాలని మరియు విష్ణు పురాణ రచయిత పరాశర మరియు సన్యాసి సదాగోప నామాలు శాశ్వతంగా ఉండేలా చూడాలని.

ఈ విషయాలకు రామానుజులు ఎంతో ఆవేదనకు గురయ్యారు. శ్మశాన వాటికలోనే యామునాచార్యులవారి మృతదేహం ముందు అతను భగవంతుని ఇష్టానుసారం యమునాచార్యులవారి మూడు కోరికలను తప్పక నెరవేరుస్తానని గంభీరమైన వాగ్దానం చేశారు. రామానుజులు 120 సంవత్సరాలు జీవించారు. ఆయన తన సుదీర్ఘ జీవితంలో యామునాచార్యులవారి యొక్క మూడు కోరికలను నెరవేర్చడం ద్వారా తన వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చారు.

యామునాచార్యుల మరణానతరం శ్రీరంగం మరియు ఇతర ప్రాంతాలలో ఉన్న ఆయన శిష్యులు శ్రీరంగంలోని మఠానికి అధిపతిగా యమునాచార్యులవారి స్థానంలో రామానుజుని మఠాధిగా ఆధిపత్యం తీసుకోవాలని కోరారు. యమునాచార్యులవారి కోరిక కూడా అదే. తదనుగుణంగా, రామానుజుడు ఆయన స్థానాన్ని స్వీకరించి శ్రీరంగంలోని విశిష్టాద్వైత మఠానికి అధిపతిగా ఉండి అన్ని కార్యక్రమాలను, ఉత్సవాలను మరియు వేడుకలను సక్రమంగా నిర్వహించారు.

మంత్ర దీక్ష

రామానుజులు ఎనిమిది అక్షరాల పవిత్ర మంత్రం 'ఓం నమో నారాయణాయ' జపానికి నంబి నుండి దీక్ష తీసుకోవడానికి తిరుకొట్టియూర్కు వెళ్ళారు. వెంటనే నంబి రామానుజులకు సులభంగా దీక్ష చేయడానికి ఇష్టపడలేదు. రామానుజుడిని శ్రీరంగం నుండి మధురై వరకు

98