మహాభారతతత్త్వ కథనము
డు. కావ్యము వ్రాసిన వాడొకడు అందు సర్గములు విభజించిన వాడు మఱియొకడు' అన్నట్లు హాస్యాస్పదము ఇక ఆ 100 పర్వములను 18 పర్వములుగా సౌతి చేసినను వారి వాదమునకు వారు చూపిన ప్రమాణము బలకర మగునేమో చూతము---
శౌనకాదులకు సౌతి చెప్పుచున్న సందర్భములో నిట్లున్నది---
'భారత స్యేతిహాసస్య శ్రూయతాం పర్వసంగ్రహః' అ||2. శ్లో / 41. ని ప్రారంభించి ... "భవిష్యపర్వచా వ్యుక్తం ఖిలే ష్వేవాద్భుతం మహత్ " 81. అనువరకు 100 పర్వములు చెప్పి, తరువాత--,
ఏత త్పర్వశతం పూర్ణం వ్యాసే నోక్తం మహాత్మనా
యథాన త్సూతపుత్రేణ లౌమహర్షణీనా తతః
ఉక్తాని నైమిశారణ్యే పర్వాన్యష్టాదశైవ తు ||
అని చెప్పబడినది. ఇచ్చట 'ఏత త్పర్వశతం పూర్ణం వ్యాసే నోక్తమ్'
'అనునపుడు రచింపబడిన దని యర్థము, 'సూతపుత్రేణ అష్టాదశప
ర్వాణి నైమిశారణ్యె ఉక్తా న్యేవ' అనునపుడు ఋషి ప్రశ్నానుగుణము
వ్యాసప్రోక్తమునే వినిపింప నారంభించిన సౌతిచే వినిపింపబడి
న వనియే యర్థము ఇచ్చట 'గ్రంధ మంతయు వ్యాసకర్తృక'మే యైన
యెడల వ్యాసుడే 'వ్యాసే నోక్తమ్' అని అన్యులు చెప్పినట్లు చెప్పుట
అసంగత' మని ప్రతివాదులు ఆక్షేపింతురేమో-
"అనుక్రమణికాపర్వము, పర్వసంగ్రహపర్వము, పౌలోమప ర్వము, పౌష్య పర్వము సౌతి కావించిన వనుటకు సంశయము లేదు"